News September 8, 2025
శ్రీరాంపూర్ ఏరియా 19 మందికి పదోన్నతి

సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా నుంచి 19మందికి డిప్యూటీ మేనేజర్లుగా పదోన్నతి లభించింది. సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో సాత్విక్, వినయ్రెడ్డి, వెంకటరామ్, హేమంత్, వేణుగోపాల్, అనిల్, నాగరాజు, అనిల్సింగ్, జగదీశ్వర్ రావు, జలాలుద్దీన్, మధుసూదన్రావు, రవికిరణ్,శ్రీనివాస్, రొడ్డ రాజేష్, కిరణ్కుమార్, రాకేష్,నరేష్, సునీల్కుమార్,చంద్రశేఖర్రెడ్డి ఉన్నారు.
Similar News
News September 10, 2025
జగిత్యాల: ఇక భూములకు ప్రత్యేక భూధార్ కార్డులు

ప్రతి వ్యక్తికి జారీ చేసిన ఆధార్ కార్డు లాగ, ఇక ప్రతి భూమికి భూధార్ కార్డును జారీ చేయనున్నారు. దీని ఆధారంగా భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, ఏ విధంగా సంక్రమించింది, బీమా, బ్యాంకు రుణాల వంటి వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్ల, ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.
News September 10, 2025
మెట్పల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

JGTL(D) మెట్పల్లి శివారులోని వేంపేట్ రోడ్డులోని BC హాస్టల్ ముందు మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టాటా ACE, ద్విచక్రవాహనం ఢీకొనగా వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడిని వేంపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి నర్సయ్యగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
ఖమ్మం: కేయూలో ఎల్ఎల్బీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.