News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

image

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్‌సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.

Similar News

News September 9, 2025

వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

image

AP: వివేకా హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా? అన్నదానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గతంలో ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు అఫిడవిట్ దాఖలుకు మరింత సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

News September 9, 2025

ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో అప్రెంటీస్‌లు

image

DRDOకు చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌-చాందీపూర్‌‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అప్రెంటీస్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్‌లు పోస్టులు 32, డిప్లొమా అప్రెంటీస్‌లు 22 ఉన్నాయి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://drdo.gov.in/

News September 9, 2025

రేపటి నుంచే పీఈసెట్ కౌన్సెలింగ్

image

AP PECET(వ్యాయామ విద్య) కౌన్సెలింగ్ రేపటినుంచి జరగనుంది. విద్యార్థులు ఈ నెల 13వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఈనెల 11 నుంచి 14వరకు, కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదు 14నుంచి 16వరకు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు ఎడిట్ ఈ నెల 17న అవకాశం ఇచ్చారు. ఈ నెల 19న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.