News September 9, 2025

ఏటూరునాగారం డిగ్రీ కాలేజీలో మహిళా సాధికారతపై అవగాహన

image

మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మిషన్ శక్తి 10 రోజుల అవగాహన కార్యక్రమంలో ఏటూరునాగారం ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు గృహహింస చట్టం-2005, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం -2013, వరకట్న నిషేధ చట్టం-1961, అనైతిక రవాణా నివారణ-1956 చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యులు మహేందర్, పి.రమాదేవి, శిరీష, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 10, 2025

REWIND: వికారాబాద్ జిల్లాలో 309 మంది ఆత్మహత్య

image

వికారాబాద్ జిల్లాలో చిన్నపాటి సమస్యకే ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో 2024, 25 సంవత్సరాల్లో వివిధ కారణాలతో 309 మంది ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. బతికి సాధించుకోవాలని పెద్దలు ఎంత చెబుతోన్న కొందరు చిన్న చిన్న కారణాలతో తనువు చాలించడం బాధాకరం. ఇకనైనా మనస్తాపాలు వీడి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి.
నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం.

News September 10, 2025

NLG: డ్రైవర్ల కొరతే ఆర్టీసీకి పెద్ద సమస్య..!

image

డ్రైవర్ల కొరతతో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కని పరిస్థితి నెలకొంది. నల్గొండ, సూర్యాపేట డిపోలకు మొత్తం 156 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. జీతాలు తక్కువగా ఉండడంతో పాటు.. డీలక్స్ బస్సుల డ్రైవర్లకు రోజుకు రూ.30 వేల టార్గెట్లు ఇవ్వడంతో డ్రైవర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఆర్టీసీకి డ్రైవర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. టార్గెట్లతో తమపై ఒత్తిడి పెరుగుతుందని డ్రైవర్లు అంటున్నారు.

News September 10, 2025

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిండిన చెరువులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ నిండాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 1,086, నాగర్‌కర్నూల్‌లో 1,222, వనపర్తిలో 1,096, నారాయణపేటలో 650, జోగులాంబ గద్వాలలో 375 చెరువులు దాదాపు 90 శాతం వరకు నిండిపోయాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1.70 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మీ దగ్గర చెరువులు నిండాయా..? COMMENT