News September 9, 2025
రైతు వేదికల్లోనూ యూరియా పంపిణీ: తుమ్మల

TG: యూరియా కోసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లోనూ నిన్నటి నుంచి యూరియా పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో పంపిణీ సజావుగా సాగుతున్నట్లు వెల్లడించారు. జియో పొలిటికల్ ఉద్రిక్తతలు, దేశీయ ఉత్పత్తి తగ్గడంతో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు.
Similar News
News September 9, 2025
బ్రెవిస్ జాక్పాట్.. ఏకంగా రూ.8 కోట్లు

సౌతాఫ్రికా క్రికెటర్ బ్రెవిస్ జాక్పాట్ కొట్టారు. SA20 సీజన్ 4 వేలంలో అతడిని ప్రిటోరియా క్యాపిటల్స్ రూ.8.30 కోట్లకు దక్కించుకుంది. లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. బేబీ ఏబీగా గుర్తింపు పొందిన బ్రెవిస్ ప్రస్తుతం IPLలో చెన్నై తరఫున ఆడుతున్నారు. నో లుక్ సిక్సర్లు కొట్టడంలో ఈ చిచ్చర పిడుగు దిట్ట. అటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ.7 కోట్లకు దక్కించుకుంది.
News September 9, 2025
మూడు రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News September 9, 2025
గద్దెల మార్పు నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు: మేడారం పూజారులు

TG: మేడారంలో గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క, సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా దేవతల గద్దెలు ఒక్కో దిక్కున ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.