News April 4, 2024

టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది: బొత్స

image

గరివిడి మండలం నీలాద్రిపురం, రేగటి గ్రామాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. అనంతరం జరిగిన ప్రచార సభల్లో ఆయన మాట్లాడుతూ.. పేదలకు అందే లబ్ధితోనూ టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రహితంగా, దళారులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్నామ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మరలా వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

image

జనాబ్‌ మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.

News November 9, 2025

అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలి: VZM కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారార్థం రేపు (సోమవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వివరాలతో పాటు అర్జీలను సమర్పించాలని సూచించారు. అర్జీల స్థితి కోసం కాల్‌ సెంటర్‌ 1100 ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.

News November 9, 2025

విశాఖలో విజయనగరం జిల్లా వాసి మృతి

image

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి విశాఖలోని మల్కాపురంలో కొన్నేళ్లుగా ఉంటున్నాడు. అక్కడే ఓ బార్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యం బారిన పడిన గణపతి శనివారం అర్ధరాత్రి బార్ వద్దే ఆకస్మికంగా మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.