News April 4, 2024

HYD: రూ.1.26 కోట్లతో సబ్ స్టేషన్ అప్‌గ్రేడేషన్

image

HYDలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా TSSPDCL అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం మేడిపల్లి నారపల్లి 5MVA కెపాసిటీ గల సబ్ స్టేషనును రూ.1.26 కోట్లతో 8MVA కెపాసిటీ కలిగిన సబ్ స్టేషన్‌గా అప్ గ్రేడ్ చేసినట్లుగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండును దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల ఇలాంటి చర్యలు చేపడతామన్నారు.

Similar News

News September 18, 2025

అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

image

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్‌పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.

News September 18, 2025

BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

image

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

HYD: బ‌తుక‌మ్మ‌, దసరా కోసం ప్రత్యేక బస్సులు

image

బ‌తుక‌మ్మ‌, దసరాకు ప్రయాణికుల కోసం TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది.