News April 4, 2024
తొలి మ్యాచ్లోనే POTM అవార్డు అందుకుంది వీరే

తానాడిన తొలి మ్యాచ్లోనే లక్నో యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నారు. ఇంతకుముందు కూడా IPLలో కొంత మంది ప్లేయర్లు ఇలాంటి ప్రదర్శనే చేసి తమ తొలి మ్యాచ్లోనే POTM అవార్డు అందుకున్నారు. మెక్కల్లమ్, మైక్ హస్సీ, మహరూఫ్, అక్తర్, గోస్వామి, థెరాన్, పరమేశ్వరన్, రిచర్డ్ లెవి, స్టీవ్ స్మిత్, మనన్ వోహ్రా, ఆండ్రూ టై, ఆర్చర్, అల్జారీ జోసెఫ్, గుర్నీ, ఒడియన్ స్మిత్ ఉన్నారు.
Similar News
News February 11, 2026
రూ.55లక్షల తలసరి ఆదాయమే టార్గెట్: గవర్నర్

AP: 2047 నాటికి రూ.308లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే టార్గెట్గా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. రూ.55లక్షల తలసరి ఆదాయమే లక్ష్యమని తెలిపారు. ‘సూపర్-6 సహా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యకలాపాలను పున:ప్రారంభించడంపై దృష్టిపెట్టాం. విధానాలు, వ్యయప్రాధాన్యతలలో కీలక సవరణలు చేశాం’ అని ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.
News February 11, 2026
ఆకాశంలో అద్భుతం.. ‘హృదయ’ కాంతిని చూడండి!

ప్రేమికుల రోజుకు ముందు ఆకాశంలో అద్భుతం జరిగింది. హృదయపు ఆకారంలో ఏర్పడిన నార్తర్న్ లైట్స్ కనువిందు చేస్తున్నాయి. వినీల ఆకాశంలో ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తున్న ‘హార్ట్’ను నార్వేలో క్రిస్టొఫర్ వెంజెన్ బంధించారు. శీతాకాలంలో ఆర్కిటిక్ సమీపంలో ఈ నార్తర్న్ లైట్స్ కనిపిస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే ఛార్జ్డ్ కణాలు ఆక్సిజన్, నైట్రోజన్తో ఢీకొన్నప్పుడు ఆకుపచ్చ, పింక్, ఎరుపు, నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి.
News February 11, 2026
నటుడి ఆవేదన.. సాయానికి ముందుకొస్తున్న సెలబ్రిటీలు

₹9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్పాల్ యాదవ్ <<19103948>>జైలులో సరెండరైన<<>> విషయం తెలిసిందే. ఆదుకునేందుకు ఎవరూ రాలేదంటూ వాపోయిన ఆయన కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. రాజ్పాల్కు తన చిత్రంలో అవకాశం ఇస్తానని సోనూ సూద్ తెలిపారు. తాను ₹1.1 కోట్లు ఇస్తానని GemTunes Music ఓనర్ రావ్ ఇంద్రిజిత్ సింగ్ ప్రకటించారు. నటుడు గుర్మీత్, పొలిటీషియన్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సాయం చేస్తామని అన్నారు.


