News September 9, 2025

వనపర్తి: 13న జాతీయ మెగా లోక్ అదాలత్

image

ఈనెల 13న జరుగు జాతీయ మెగాలోక్ అదాలత్‌‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. కక్ష కారుణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీ మార్గమే రాజ మార్గం అన్నారు. కొట్టుకుంటే ఒకరే గెలుస్తారు, రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని, రాజీతో సమయాన్ని డబ్బులను ఆదా చేసుకోవచ్చన్నారు. వివాదాలు అనేవి పెంచుకుంటే జీవితకాలం కొనసాగుతాయి.. ఒకవేళ ఇంతటితో కలిసుంటామని ఓ నిర్ణయానికి వస్తే అప్పుడే సమసిపోతాయన్నారు.

Similar News

News September 10, 2025

నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే అంతే..

image

ప్రజలు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయనడానికి మరో నిదర్శనం నేపాల్. తీవ్ర అవినీతి, ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు SMపై బ్యాన్ విధించడంతో నేపాలీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నుకున్న నేతలనే రోడ్లపై తన్నుకుంటూ తరిమికొట్టారు. PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోయారు. గతేడాది సరిగ్గా ఇలాంటి పరిస్థితులే బంగ్లాలోనూ కనిపించాయి. ప్రజల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె పారిపోయి INDకు వచ్చేశారు.

News September 10, 2025

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నేడు సెలవు

image

అనంతపురంలో నేడు ‘సూపర్ 6-సూపర్ హిట్’ విజయోత్సవ సభ నేపథ్యంలో అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానుండటంతో రద్దీ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేడు సెలవు కారణంగా రెండో శనివారమైన ఈ నెల 13న పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయన్నారు.

News September 10, 2025

KNR: RTC పంచారామాలు టూర్ ప్యాకేజీ వివరాలు

image

KNR- 2 డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు DM శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో పంచారామాలు అనగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోట దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఈనెల 12న రా.10 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 15న బస్సు KNR చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.3,300/-, పిల్లలకు రూ.2,500/- టికెట్ నిర్ణయించామన్నారు. వివరాలకు CALL 9398658062.