News September 9, 2025

యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దు: జాయింట్ కలెక్టర్

image

యూరియా ఎరుకుల కోసం రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. సామర్లకోట మండలం అచ్చంపేటలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయకుమార్‌తో కలిసి ఎరువుల పరిస్థితి పరిశీలించారు. రైతులు మంచి ప్రయోజనాలు కలిగిన నానో యూరియాను వినియోగించాలని కోరారు. రైతులు సాగుచేసిన పంటల వివరాలు ధాన్యం కొనుగోళ్లపై కూడా మాట్లాడినట్లు మండల వ్యవసాయ అధికారి మురళీధర్ తెలిపారు.

Similar News

News March 7, 2026

సివిల్స్‌లో కర్నూలు యువకుడికి 297వ ర్యాంకు

image

కర్నూలుకు చెందిన పవనకుమార్ రెడ్డి సివిల్స్ ఫలితాల్లో 297వ ర్యాంకు సాధించారు. గతేడాది 375వ ర్యాంకుతో IRSకు ఎంపికైన ఆయన, IAS సాధనే లక్ష్యంగా ఢిల్లీలో శిక్షణ పొందారు. నిన్న విడుదలైన ఫలితాల్లో 297 ర్యాంకుతో సత్తా చాటారు. చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని పవన్ తెలిపారు. తన ర్యాంకుకు ఐఏఎస్ వస్తే వెళ్తానని, లేదంటే మరోసారి ప్రయత్నించి ఉత్తమ ర్యాంకు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

News March 7, 2026

విజయవాడ: తండ్రి సీఐ.. కుమార్తెకు సివిల్స్‌లో 520 ర్యాంక్

image

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాలను శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అహోరాత్రులు శ్రమించిన అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. విజయవాడకు చెందిన సీఐ సుధాకర్ కుమార్తె హర్షిత 520వ సాధించి సత్తాచాటారు. తాను 2022 సంవత్సరం నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్లు హర్షిత తెలిపారు. ఈ మేరకు ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.

News March 7, 2026

WGL: పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

image

జిల్లాలో ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని 288 పాఠశాలల నుంచి మొత్తం 9,492 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,932 మంది బాలురు, 4,560 మంది బాలికలు ఉన్నారు. వీరి కోసం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం నిషేధం.