News September 9, 2025
సంగారెడ్డి: విద్యార్థులకు తక్షణమే వైద్యం అందించాలి: మంత్రి

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో హాస్టల్ గోడ కూలిన ఘటనలో ముగ్గురు (3) విద్యార్థులు స్వల్ప గాయాల పాలైన ఘటనపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటన జరిగిన గురుకుల పాఠశాలను పరిశీలించాలని కలెక్టర్ ప్రావీణ్యకు ఆదేశించారు. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ఘటనలో స్వల్ప గాయాలతో బయట పడిన విద్యార్థులకు తక్షణమే వైద్య చికిత్సలు అందించాలన్నారు.
Similar News
News September 10, 2025
KNR: SU LLB, LLM పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరగనున్న LLB 4వ సెమిస్టర్, LLM 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం అపరాధ రుసుము(లేట్ ఫీ) లేకుండా SEPT 18 వరకు, లేట్ ఫీజు రుసుము రూ.300తో SEPT 22 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణాధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ను లేదా ఆయా కళాశాలలను సంప్రదించవచ్చని సూచించారు.
News September 10, 2025
నర్సాపూర్: తల్లి, ఇద్దరు పిల్లలు మిస్సింగ్.. కేసు నమోదు

పిల్లలను ఆసుపత్రిలో చూపించడానికి వెళ్లిన తల్లి, ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన నర్సాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నారాయణపూర్కు చెందిన వివాహిత తన ఇద్దరు పిల్లలను మంగళవారం ఆస్పత్రిలో చూపించడానికి వెళ్లి కనిపించకుండా పోయింది. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
News September 10, 2025
నల్గొండ: ప్రాజెక్టులు పూర్తైతే పెరగనున్న సాగు విస్తీర్ణం

ఉమ్మడి NLG జిల్లా రైతులకు మహర్ధశ పట్టనుంది. మంగళవారం జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించిన మంత్రి ఉత్తమ్ 2027 నాటికి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. SLBC పూర్తైతే సుమారు 4 లక్షల ఎకరాలు, డిండి ఎత్తిపోతల కింద మూడున్నర లక్షల ఎకరాలు, బస్వాపూర్ కింద 23 వేల ఎకరాలు, మరికొన్ని ప్రాజెక్టులు కింద కలుపుకుని 8 లక్షల ఎకరాలకు పైనే సాగు విస్తీర్ణం పెరగనుంది.