News September 9, 2025

కృష్ణానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

image

కొల్లూరు మండలం పెసర్లంక సమీపంలోని అరవింద వారధి కృష్ణానదిలో గల్లంతైన యువకుడి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు తహశీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చింతల్లంక గ్రామానికి చెందిన తోడేటి హర్షవర్ధన్ (22) ఆదివారం రాత్రి కృష్ణానదిలో గల్లంతయ్యాడు. అతని మృతదేహం కృష్ణాజిల్లా నాగాయలంక మండలం కొత్తపాలెంలో లభ్యమైంది.

Similar News

News September 10, 2025

జగిత్యాల: ఇక భూములకు ప్రత్యేక భూధార్‌ కార్డులు

image

ప్రతి వ్యక్తికి జారీ చేసిన ఆధార్ కార్డు లాగ, ఇక ప్రతి భూమికి భూధార్ కార్డును జారీ చేయనున్నారు. దీని ఆధారంగా భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, సరిహద్దులు, ఏ విధంగా సంక్రమించింది, బీమా, బ్యాంకు రుణాల వంటి వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. దీంతో నకిలీ డాక్యుమెంట్ల, ఒకే భూమిని పలువురికి రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.

News September 10, 2025

మెట్‌పల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

JGTL(D) మెట్‌పల్లి శివారులోని వేంపేట్ రోడ్డులోని BC హాస్టల్ ముందు మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టాటా ACE, ద్విచక్రవాహనం ఢీకొనగా వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడిని వేంపేట్ గ్రామానికి చెందిన మగ్గిడి నర్సయ్యగా గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 10, 2025

ఖమ్మం: కేయూలో ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ (కేయూ) పరిధిలో ఈ నెల 12న జరగాల్సిన ఎల్ఎల్‌బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన ఈ పరీక్షలు ఈనెల 15న జరుగుతాయని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.