News September 9, 2025

CPGETలో జగిత్యాల విద్యార్థినికి రాష్ట్రస్థాయి 4వ ర్యాంక్

image

జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని సయ్యద్ ఫలక్ CPGET– 2025(కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్)లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. హిందీ విభాగానికి చెందిన ఈమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ హిందీ కోర్సులో ప్రవేశానికి అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఆమెను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్, హిందీ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ వాసాల వరప్రసాద్, తదితర అధ్యాపకులు అభినందించారు.

Similar News

News March 9, 2026

నిర్మల్: మరింత వేగవంతమైన పోలీస్ సేవలు: ఎస్పీ

image

నిర్మల్ పట్టణ ప్రజలకు మరింత వేగవంతమైన పోలీస్ సేవలు అందించేందుకు నిర్మల్ పట్టణంలో కొత్తగా నిర్మల్ టౌన్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజలకు సౌకర్యవంతంగా పోలీస్ సేవలు అందించేందుకు, కేసులు, ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించేందుకు నిర్మల్ టౌన్ ఔట్ పోస్ట్‌ను పాత భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News March 9, 2026

కదిరి తేరు చూతము రారండి

image

రాష్ట్రంలోనే అతిపెద్ద రథంగా ప్రసిద్ధి చెందిన కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం <<19334504>>(తేరు)<<>> రేపు జరగనుంది. 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు గల ఈ భారీ రథంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. టీటీడీ సహకారంతో మూడేళ్ల క్రితం నూతన చక్రాలను అమర్చిన ఈ రథంపై 256 అద్భుత శిల్ప కళాకృతులు ఉన్నాయి. దేశంలోనే మూడో అతిపెద్దదైన ఈ తేరును లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

News March 9, 2026

సిరిసిల్ల: 129 మంది విద్యార్థులు గైర్హాజరు

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫిజిక్స్/ఎకనామిక్స్ పరీక్షలలో 129 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. 16 పరీక్ష కేంద్రాలలో మొత్తం 4437 విద్యార్థులకు గాను 4308 విద్యార్థులు హాజరు అయినట్లు వెల్లడించారు. పరీక్షలను జిల్లా అధికారులు పర్యవేక్షించారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని వివరించారు.