News September 9, 2025
జగిత్యాల: జిల్లాలో 5వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాం ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం పూడూర్లో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యంపై ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాల గురించి రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. అనంతరం ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తదితరులు ఉన్నారు.
Similar News
News March 3, 2026
శ్రీరంగాపురం: గ్రహణం వేళ రంగనాథుని ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా దక్షిణ కాశీగా పేరొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయ ద్వారాలను మంగళవారం మూసివేశారు. గ్రహణం ముగిశాక సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతం జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను యథావిధిగా ఘనంగా కొనసాగిస్తామని ఆలయ పూజారులు, అధికారులు వెల్లడించారు.
News March 3, 2026
డెంకాడ: జనగణన-2027 తొలి దశ శిక్షణ ప్రారంభం

జనగణన-2027 తొలి దశ ‘గృహాల జాబితా’ శిక్షణను జిల్లా జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ డెంకాడలోని చింతలవలస MVGR కాలేజీలో మంగళవారం ప్రారంభించారు. అధికారులు డిజిటల్ యాప్ ద్వారా ఖచ్చితమైన డేటా సేకరణ చేసి, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అధికారులు జనగణన డేటా సేకరణపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.


