News September 9, 2025

టీచర్‌గా మారిన మంచిర్యాల జిల్లా కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ టీచర్ అవతారం ఎత్తారు. భీమారం మండలం కాజీపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. బోర్డుపై ప్రశ్నలు రాసి, విద్యార్థుల చేత సమాధానాలు రాబట్టారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో సకల సదుపాయాల కల్పించి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు.

Similar News

News March 14, 2026

దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలి: వికారాబాద్ ఎస్పీ

image

కేసుల దర్యాప్తును ఆధునిక పద్ధతులతో వేగవంతం చేయాలని వికారాబాద్ SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం SP కార్యాలయంలో కానిస్టేబుళ్లు, రైటర్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు. ఆధునిక టెక్నాలజీని వాడి దర్యాప్తు నాణ్యత పెంచాలని ఆదేశించారు.

News March 14, 2026

నంద్యాల జిల్లాలో ఒంటిపూట బడి.. టైమింగ్స్ ఇవే!

image

నంద్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. స్కూళ్లు ఉదయం 7.45 గంటలకు ప్రారంభించి, మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించాలన్నారు. మధ్యాహ్న భోజనం యథావిధిగా ఉంటుందన్నారు. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

News March 14, 2026

పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి గమనించండి!

image

పుచ్చకాయపై ఉండే మచ్చ పసుపు/నారింజ రంగులో ఉంటే పండినట్లు, తెల్లగా ఉంటే ఇంకా పండనట్లు. గుండ్రటి కాయలు తీయగా ఉంటాయి. పొడవుగా ఉండేవి తక్కువ తీపి కలిగి ఉంటాయి. ఒకే సైజులో ఉన్న వాటిలో బరువు ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. వాటిలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటాయి. కాయ కాడ పూర్తిగా ఎండిపోయి, మెరుపు తక్కువగా ఉంటే అది సహజంగా పాదుపైనే పండిందని అర్థం. గోధుమ రంగు గీతలు ఉన్న కాయలు చాలా తీయగా ఉంటాయి.