News September 9, 2025
మునిపల్లి: పాఠశాల స్థలాన్ని పరిశీలించిన మంత్రి

మునిపల్లి మండలం లింగంపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రమాదవశాత్తు హాస్టల్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడిన ఘటన ప్రదేశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహా పరిశీలించారు. ఘటనపై అధికారులతో మంత్రి చర్చించారు. హాస్టల్లోని మిగిలిన భవనాల స్టాండర్డ్స్ను పరిశీలించి ఉపయోగానికి, పనికిరాని వాటిని బ్లాక్ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
Similar News
News September 10, 2025
మళ్లీ భారీ వర్షాలు

TG: నేటి నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలవనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
News September 10, 2025
మెట్పల్లి నుంచి RTC ప్రత్యేక TOUR

MTPL నుంచి ఈనెల 12న టూర్ ఏర్పాటు చేసినట్లు DM దేవరాజ్ తెలిపారు. బీదర్ స్వయంభూ వినాయక, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, హుమ్నాబాద్ మాణిక్ ప్రభు ఆలయం, గుల్బర్గా, గనుగాపూర్ దత్తాత్రేయ ఆలయం, అక్కలకోట స్వామి సమర్థ ఆలయం, పండరిపూర్, విట్టల్, తుల్జాపూర్, పర్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగం, నాందేడ్ సిక్ గురుద్వార దర్శనమనంతరం తిరిగి 14న
బస్సు మెట్పల్లి చేరుకుంటుందన్నారు. ఛార్జీ రూ.4000. వివరాలకు: 9959225927.
News September 10, 2025
చిత్తూరు DFO భరణి బదిలీ

చిత్తూరు జిల్లా ఫారెస్టు అధికారి (DFO)గా సుబ్బరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం కోడూరు సబ్ డీఎఫ్వోగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు చిత్తూరు డీఎఫ్ఓగా ఉన్న భరణిని స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లానింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు.