News September 9, 2025

తమిళనాడు నుంచి మూడో ఉపరాష్ట్రపతి

image

దేశానికి అత్యధిక మంది ఉపరాష్ట్రపతులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తాజాగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వైస్ ప్రెసిడెంట్‌ అయిన మూడో వ్యక్తి కావడం విశేషం. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్(1952-62, రెండు సార్లు), రామస్వామి వెంకటరామన్(1984-87) ఎన్నికయ్యారు. కాగా ఉమ్మడి AP నుంచి గతంలో జాకీర్ హుస్సేన్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా సేవలందించారు.

Similar News

News September 10, 2025

1,543 ఇంజినీరింగ్ పోస్టులు

image

<>పవర్‌గ్రిడ్<<>> కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1,543 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంజినీరింగ్‌లో 55% మార్కులతో పాసైన, పని అనుభవం గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 29ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://www.powergrid.in/

News September 10, 2025

ఈ నెల 15న మెగా డీఎస్సీ తుది జాబితా?

image

AP: 16,347 ఉద్యోగాల మెగా డీఎస్సీ తుది జాబితా ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే 19న అమరావతిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో భారీ సభ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ సభలోనే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్త టీచర్లకు దసరా సెలవుల్లో ట్రైనింగ్, కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారని, సెలవుల అనంతరం స్కూళ్లు పున ప్రారంభం రోజున వారంతా విధుల్లో చేరతారని సమాచారం.

News September 10, 2025

మళ్లీ భారీ వర్షాలు

image

TG: నేటి నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలవనున్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.