News September 9, 2025
ఆసిఫాబాద్: పోరాటంతోనే ఆదివాసీ గిరిజన సమస్యల పరిష్కారం: TAGS

తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆసిఫాబాద్ జిల్లా TAGS కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ.. జిల్లాలో జీవో 49 రద్దు చేయాలని కోరుతూ 91 గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జిల్లాలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పోరాటాలు చేశామని సమావేశంలో తెలిపారు.
Similar News
News September 10, 2025
ఫేక్ వీడియోలపై ఈ నెంబర్కి ఫిర్యాదు చేయండి: ఆకే. రవికృష్ణ

సీఎం చంద్రబాబు రైతులకు యూరియా, పురుగుమందుల అధిక వినియోగం తగ్గించాలన్న సూచనలను వక్రీకరించి డీప్ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘CBN warning to farmers’ పేరుతో వస్తున్న ఫేక్ వీడియోపై CID కేసు నమోదు. సైబర్ క్రైమ్స్ ఐజీ ఆకే. రవికృష్ణ మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించడం, ఫేక్ న్యూస్ ఫార్వార్డ్ చేయడం నేరమేనని, అలాంటి వీడియోలపై 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.
News September 10, 2025
ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

ఏలూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్లు, బస్సులను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల రవాణా, పేలుడు పదార్థాలు, అసాంఘిక శక్తులను గుర్తించడం వంటి లక్ష్యాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News September 10, 2025
భద్రాద్రి: నేడు, రేపు ఆయిల్పామ్ ఫ్యాక్టరీలకు సెలవు

దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలో గల రెండు ఆయిల్పామ్ ఫ్యాక్టరీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్పామ్ గెలలు అధికంగా వచ్చాయని అన్నారు. ఈ కారణంగా బుధవారం, గురువారం గెలలు కొనబోమని పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుంచి గెలలు యథావిధిగా కొంటామని, రైతులు సహకరించాలని కోరారు.