News September 9, 2025
మంచిర్యాల: ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజీకి తగిన క్రిమినల్, సివిల్, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయ సేవా సంస్థ కార్యదర్శి నిర్మల, డీసీపీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 18, 2026
అనంతపురం మున్సిపల్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

అనంతపురం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన GO 284 ప్రకారం ఈ నియామకం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించి, పౌరులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు.
News March 18, 2026
రేపు తిరుపతికి అచ్చంపేట నుంచి ఆర్టీసీ బస్సు రద్దు

ఈనెల 19 ఉగాది పర్వదినం సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి బయలుదేరే ఆర్టీసీ బస్సును రద్దు చేసినట్లు అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20న తిరుపతి నుంచి అచ్చంపేటకు వచ్చే బస్సును రద్దు చేయడం చేశారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.
News March 18, 2026
తాళ్లూరు: లేఔట్లను పరిశీలించిన జేసీ

ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. లేఅవుట్ అప్రూవల్ కోసం పెండింగ్లో ఉన్న పలు సర్వే నంబర్లలోని భూములను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల వివరాలను ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో నిబంధనల అమలును తనిఖీ చేశారు. ఈ పర్యటనలో అద్దంకి ఆర్డీవోతో పాటు పలువురు తహశీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.


