News September 9, 2025
క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభించిన మంత్రి

TG: క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ఏర్పాటు ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ఆయన వర్చువల్గా సంగారెడ్డిలో ప్రారంభించారు. క్యాన్సర్ను సమయానికి గుర్తించకపోతే ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందన్నారు. రాబోయే కాలంలో 70% క్యాన్సర్ కేసులు పెరగొచ్చని, అందుకే ముందుగా స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు.
Similar News
News September 10, 2025
ట్రంప్తో మాట్లాడేందుకు నేనూ ఎదురుచూస్తున్నా: PM మోదీ

తనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్న <<17663735>>ట్రంప్<<>> వ్యాఖ్యలకు PM మోదీ బదులిచ్చారు. తానూ ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. క్లోజ్ ఫ్రెండ్స్ అయిన IND, US మధ్య వాణిజ్య అడ్డంకులు త్వరలోనే తొలగిపోయి, సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయని, IND-US భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామన్నారు.
News September 10, 2025
గేట్కు దరఖాస్తు చేశారా?

<
News September 10, 2025
భారత్ దెబ్బ.. దారికొస్తున్న ట్రంప్!

భారత్పై పెత్తనం చెలాయిద్దామనుకుంటున్న ట్రంప్ పాచికలు పారడం లేదు. 50% టారిఫ్స్ వేసినా ఇండియా వెనక్కి తగ్గలేదు. రష్యాతో ఆయిల్ కొనుగోళ్లను మరింత పెంచింది. చైనాతోనూ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరిస్తోంది. ఇవన్నీ మింగుడుపడని ట్రంప్ దెబ్బకు దిగొచ్చారు. ట్రేడ్ విషయంలో IND-US సక్సెస్ఫుల్ కన్క్లూజన్కు వస్తాయనుకుంటున్నట్లు తాజాగా ప్రకటించారు. PM మోదీతో <<17663735>>మాట్లాడేందుకు<<>> ఎదురుచూస్తున్నానని చెప్పడం కొసమెరుపు.


