News April 4, 2024

అనంత: నీటి టబ్‌లో పడి చిన్నారి మృతి

image

పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. శివ, రాధా దంపతుల కుమారుడు అఖిల్ అనే ఏడాది బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి టబ్‌లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 2, 2025

నిజాంను సురక్షితంగా తీసుకొస్తాం: మంత్రి లోకేశ్

image

అనంతపురానికి చెందిన నిజాంను ఇండియాకు రప్పించేందుకు తన టీం ఫాలో అప్ చేస్తుందని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ‘నిజాం దుస్థితి నన్ను తీవ్రంగా కలచివేసింది. అతన్ని సురక్షితంగా భారతదేశానికి తిరిగి తీసుకురావడానికి, అతని కొడుకుకు వైద్య సహాయం అందించడానికి నేను అన్ని విధాలుగా సహాయం చేస్తానని హామీ ఇస్తున్నా’ అని పేర్కొన్నారు. నిజాం సౌదీకి వెళ్లి ఇబ్బందులు పడుతూ తనను కాపాడాలని వేడుకున్న విషయం తెలిసిందే.

News October 2, 2025

అంతర్జాతీయ ఫిడే క్లాసికల్ రేటింగ్‌లో చిన్నారి రతనతేజ్

image

అతిచిన్న వయసులోనే తాడిపత్రికి చెందిన చెస్ క్రీడాకారుడు చిన్నారి రతనతేజ్ బుధవారం విడుదల చేసిన అంతర్జాతీయ ఫిడే క్లాసికల్ రేటింగ్‌లో స్థానం సాధించాడు. శిక్షకుడు సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్‌లోని ప్రపంచ చదరంగం సమాఖ్య విడుదల చేసిన ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ క్రీడాకారుల జాబితాలో కేవలం ఏడేళ్ల రతనతేజ్ ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిటర్ ఉదయ్ కుమార్ అభినందించారు.

News October 1, 2025

పెన్షన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఆనంద్

image

అనంతపురంలోని బుడ్డప్ప నగర్లో బుధవారం ఉదయం పెన్షన్ లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2లక్షల 79వేల మందికి పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. అనంతరం అక్కడి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.