News September 10, 2025
ఈనెల 12న జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు

ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 12న ఉదయం 10 గంటలకు ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని జిల్లా పరిషత్ CEO శ్రీహరి మంగళవారం తెలిపారు.
Similar News
News March 21, 2026
ప్లే విత్ ఫైర్.. ప్లే విత్ పేషన్స్

మరో వారంలో IPL-19 ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో RCBని SRH ఢీకొట్టనుంది. ఈసారి సన్రైజర్స్ ‘PlayWithFire’ నినాదంతో బరిలోకి దిగుతోంది. ఫైర్ అవసరమే అయినా ఆ జట్టుకు ఓపిక(Patience) కూడా ఉండాలని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఓపెనర్లు ఫైర్ చూపించాలని, మిడిల్ ఆర్డర్ పేషన్స్తో ఆడాలని కోరుతున్నారు. తద్వారా ప్రత్యర్థిపై పైచేయి సాధించి, భారీ స్కోర్కు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మీరేమంటారు?
News March 21, 2026
రాజానగరం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి గాయాలు!

రాజానగరం జాతీయ రహదారి ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి వాడపల్లి వెళ్తుండగా వీరి కారును రాజమండ్రి నుంచి కాకినాడ వైపు వస్తున్న లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీఎస్ఎల్ ఆస్పత్రికి తరలించారు. కారులో డ్రైవర్తో సహా మొత్తం ఏడుగురు ఉండగా, బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలర్ట్

విశాఖపట్నం – బ్రహ్మపూర్ ప్యాసింజర్ (58532) రైలు రీషెడ్యూల్ అయింది. మార్చి 21న సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, అనివార్య కారణాల వల్ల రాత్రి 6:50 గంటలకు బయలుదేరనుందని సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే శాఖ విచారం వ్యక్తం చేస్తూ, ఈ మార్పును గమనించి ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు.


