News September 10, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్?

ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలిచిన NDA అభ్యర్థికి 452 ఓట్లు పోలయ్యాయి. ఎన్డీఏకు 427+11(వైసీపీ) ఎంపీల సపోర్ట్ ఉంది. దీని ప్రకారం NDAకు 438 ఓట్లు పోలవ్వాల్సి ఉండగా 14 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇవి క్రాస్ ఓటింగ్ ఓట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఇండీ కూటమి ఎంపీలు 315మంది ఓట్లేశారని జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. కానీ ఫలితాల్లో వారి అభ్యర్థికి 300 ఓట్లే పడ్డాయి. మరోవైపు 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
Similar News
News February 5, 2026
BIG BREAKING: ఒకే రోజు రూ.20,000 తగ్గిన ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్ రేటు రూ.20,000 తగ్గి రూ.3 లక్షలకు చేరింది. ఐదు రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు నిన్న పెరిగిన విషయం తెలిసిందే. ఒక్కరోజులోనే మళ్లీ రేట్లు పతనమయ్యాయి.
News February 5, 2026
తినేటప్పుడు ఇలా చేస్తున్నారా?

ఆహారపు అలవాట్లు ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. దంపతులు ఒకే ప్లేట్లో భోజనం చేయకూడదు. దీనివల్ల కుటుంబంలోని ఇతర సభ్యుల పట్ల వివక్ష, అసూయ పెరిగే ఛాన్సుందని పండితులు చెబుతున్నారు. మంచం మీద కూర్చుని తింటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందట. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నమ్మకం. నేలపై కూర్చుని తింటే సుఖసంతోషాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
News February 5, 2026
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్ సుమారు 250 పాయింట్లు తగ్గి 83,571కు చేరగా, నిఫ్టీ 87 పాయింట్లు క్షీణించి 25,689 వద్ద ట్రేడ్ అయ్యింది. గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పాటు టెక్ షేర్ల నష్టాలు మార్కెట్పై ప్రభావం చూపాయి. రియల్టీ, ఫార్మా షేర్లు నష్టాల్లో ఉండగా, ఎఫ్ఎంసీజీ, పీఎస్యూ బ్యాంక్ షేర్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి.


