News September 10, 2025
జగిత్యాల: కాళోజీ రచనలు సమానత్వాన్ని ప్రతిబింబించాయి

జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాకవి కాళోజీ సేవలు, తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన కృషి, రచనలు, తెలంగాణ సంస్కృతి, స్వేచ్ఛ, సమానత్వాన్ని ప్రతిబింబించాయని కలెక్టర్ అన్నారు.
Similar News
News March 16, 2026
శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షకు 105 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 105 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. జిల్లాలోని 145 కేంద్రాల్లో పరీక్షలు జరగగా 28,637 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 28,532 మంది హాజరైనట్లు తెలిపారు. ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షకు 575 మంది విద్యార్థులకు గాను 85 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పేర్కొన్నారు.
News March 16, 2026
కృష్ణా: పాలక వర్గం లేకపోవడమే.. అక్కడ శాపం

చారిత్రక నేపథ్యం ఉన్న యనమలకుదురు రామలింగేశ్వర స్వామి ఆలయానికి పాలకవర్గం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తి ఆధిపత్యం కోసం కమిటీ ఏర్పాటును అడ్డుకుంటున్నారని, దీనిపై ఎమ్మెల్యే కూడా మౌనం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆలయంలో రూ. 10 లక్షల మాయంపై కేసు నమోదైనా, పోలీసులకు ఆధారాలు ఇవ్వకుండా దర్యాప్తును పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News March 16, 2026
జగ్గయ్యపేటలో TDP, జనసేన మధ్య కోల్డ్ వార్!

జగ్గయ్యపేట నియోజకవర్గంలో TDP, జనసేన నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. పదవులు, పనుల పంపిణీలో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జనసేనను చూసి TDPకి భయం పట్టుకుందని జనసేన జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఆలయ ట్రస్ట్ పదవుల కేటాయింపు, ప్రొటోకాల్ విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యమే ఈ ఘర్షణకు కారణమని తెలుస్తోంది.


