News September 10, 2025
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక(మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30 రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 20, 2026
విద్యుత్ సిబ్బంది భద్రతకు ‘ఎల్సీ యాప్’ కవచం

ఖమ్మం: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కొనియాడారు. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని, ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల విద్యుత్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు.
News March 20, 2026
మండిపోతున్న ఎండలు.. చుక్కల్లో నిమ్మ ధర!

జిల్లాలో భానుడి భగభగలకు తోడు నిమ్మ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎండాకాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలకు గిరాకీ పెరిగి, ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. గతంలో డజను రూ. 20-30 పలికిన ధర.. ప్రస్తుతం ఏకంగా రూ. 80-100కు చేరింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో కాయ రూ. 7 నుంచి రూ. 10 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో వినియోగదారులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు.
News March 20, 2026
పర్యాటకానికి ‘బడ్జెట్’ ఊతం ఇచ్చేనా?

రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యాటక రంగానికి మహర్దశ పడుతుందని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. పాలేరు నుంచి పర్ణశాల వరకు పర్యాటక కారిడార్ అభివృద్ధికి, భద్రాద్రి, జమలాపురం వంటి పుణ్యక్షేత్రాల ఆధునీకరణకు సుమారు రూ. 500 కోట్లు అవసరమని అంచనా. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా ఇప్పుడే నిధులు కేటాయిస్తేనే ఘాట్లు, రహదారుల పనులు సకాలంలో పూర్తవుతాయి.


