News April 4, 2024

అలా జరిగితే పోలవరంలో ఓడిపోతాం: TDP

image

ఏడుళ్లుగా టీడీపీ పోలవరం ఇంఛార్జ్ బొరగం శ్రీనివాస్ ప్రజాధారణ పొందారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. పోలవరం మండలం కొత్త దేవరగొందిలో వారు మీడియాతో మాట్లాడారు. బొరగం శ్రీనుకు తప్ప ఇంకెవరికి ఇచ్చినా పోలవరంలో టీడీపీ ఓడిపోతుందన్నారు. శ్రీనివాసులకు ఇస్తే తమ ఏడు మండలాల ప్రజలు కలిసి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని స్పష్టం చేశారు.

Similar News

News March 19, 2026

ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

image

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.

News March 19, 2026

భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

image

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

News March 19, 2026

తణుకు: రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు

image

తణుకు పట్టణం శివారు పాత బెల్లం మార్కెట్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తణుకు ఆకుల వారి వీధికి చెందిన పుదుకూడి కార్తీక్‌ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం సాయంత్రం బైక్‌పై ఇంటికి వస్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.