News September 10, 2025
MBNR: రైతులు ALERT..కృషి విజ్ఞాన కేంద్రం కీలక సూచనలు

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతు పొలాలలో వరి పంటలో ఆకులు చుట్టుకుని పోయి ఆకుల పైన తెల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయని పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. తామర పురుగుల వల్ల ఏర్పడతాయని, వెంటనే వరిసాగు చేసే రైతులు ఫటేరా @4 కిలోలు ఎకరానికి లేదా/ క్లోరన్ త్రినిల్ ప్రోల్ @60 మి.లీ ఎకరానికి లేదా/ ఫిప్రోనిల్ @400 మిల్లీలీటర్లు ఎకరానికిలో పిచికారి చేస్తే దీని ఉద్ధృతి తగ్గుతుందన్నారు.
Similar News
News March 12, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. 13కు చేరిన మృతుల సంఖ్య!

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషాద ఘటనలో బుధవారం రెండేళ్ల బాలుడు <<19354442>>జై క్రిత్ రాజ్<<>> మరణించగా.. గురువారం తెల్లవారుజామున బండారు వీరలక్ష్మి(60) ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్య ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇప్పటివరకు ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. కాగా ఏడుగురు బాధితులు వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు.
News March 12, 2026
ఖమ్మం: విద్యుత్ ఫిర్యాదులకు ‘వాట్సాప్’ పరిష్కారం

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. NPDCL ప్రత్యేకంగా వాట్సాప్ చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. 79016 28348 నంబర్కు Hi అని సందేశం పంపి, మీ సర్వీస్ నంబర్ ద్వారా ఇంట్లోనే ఉండి ఫిర్యాదు చేయవచ్చు. సమస్య పరిష్కారమయ్యాక IVRS ద్వారా నిర్ధారణ చేసుకునే పారదర్శక విధానం కల్పించారు. అత్యవసరసమయాల్లో 1912కు కాల్ చేయాలని ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు.
News March 12, 2026
X యూజర్లకు షాక్

ఇక నుంచి X (ట్విటర్)లో గ్రోక్ను ప్రశ్నలు అడగలేం. కేవలం ప్రీమియం, ప్రీమియం+ సబ్స్క్రైబర్లకు మాత్రమే ఆ ఫీచర్ అందుబాటులో ఉందని X ప్రకటించింది. ప్రీమియం కోసం నెలకు రూ.230, ప్రీమియం+ కోసం నెలకు రూ.1,285 చెల్లించాలి. కాగా Xలో పోస్టులపై ఏమైనా సందేహాలు ఉంటే నెటిజన్లు గ్రోక్ను అడిగి వాటిని నిర్ధారించుకునేవారు.


