News September 10, 2025

జగిత్యాల: ‘సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి’

image

ఈ మధ్యకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వైద్య సిబ్బంది అప్రమత్తమై సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని ఐడీఓసీ కార్యాలయంలో వైద్యారోగ్య సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దోమల లార్వాలు వృద్ధి చెందకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

Similar News

News March 18, 2026

VZM: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉగాది వేడుకలను స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు పాల్గొనాలని కోరారు.

News March 18, 2026

VZM: జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

image

శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని, జిల్లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఉగాది వేడుకలను స్థానిక శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు పాల్గొనాలని కోరారు.

News March 18, 2026

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్

image

ప్రకాశం భవనంలో జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులు 22(ఏ) కేసులు, మ్యుటేషన్లు, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు వారాల గడువులోనే కేసులు పరిష్కరించాలని తెలిపారు. ప్రజల సమస్యలు ఆలస్యం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులు పాల్గొన్నారు.