News September 10, 2025

ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు

image

ఏలూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్లు, బస్సులను తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల రవాణా, పేలుడు పదార్థాలు, అసాంఘిక శక్తులను గుర్తించడం వంటి లక్ష్యాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News March 10, 2026

ప్రజాప్రతినిధుల శిక్షణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 12న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణ గూర్చి జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ ఛైర్మెన్లు, కౌన్సిలర్లు శిక్షణ తరగతులకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99రోజుల కార్యక్రమంలో ఆయా థీమ్స్ పై ప్రజాప్రతినిధులకు శిక్షన ఇవ్వనున్నట్టు తెలిపారు.

News March 10, 2026

గుంటూరు: మరి కాసేపట్లో ముగియనున్న గడువు

image

గుంటూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు మరికొన్ని గంటలే మిగిలాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో 25% సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తున్నారు. అర్హులైన తల్లిదండ్రులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల్లోపు ఉండాలి. ఎంపిక కోసం లాటరీ విధానం అమలు చేస్తారు. ఎంపికైన వారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 7 వరకు ప్రవేశాలను నిర్ధారించాలి.

News March 10, 2026

సిద్ధిపేట: ‘ఆరోగ్య ఖాకీ’కి సీపీ శ్రీకారం

image

పోలీస్ అధికారుల సంక్షేమం కోసం సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ మంగళవారం ‘ఆరోగ్య ఖాకీ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శారీరకంతో పాటు మానసిక దృఢత్వం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మంది సిబ్బందికి వివిధ రకాల పరీక్షలు చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించి ఫిట్‌గా ఉండాలని కోరారు.