News September 10, 2025

పీఎంఈజీపీపై అవగాహన కల్పించాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

image

నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం (PMEGP) అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు 83 దరఖాస్తులు రాగా, 13 యూనిట్లకు బ్యాంక్ రుణాలు మంజూరు చేశామని, పెండింగ్‌లో ఉన్న 21 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

Similar News

News March 14, 2026

నర్మెట్ట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు

image

సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల రూ.300 కోట్ల నిధులతో పూర్తి చేయించారని తెలిపారు. ఈ పరిశ్రమ ఈ ప్రాంత రైతుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.

News March 14, 2026

గద్వాల: సోమవారం ప్రజావాణి రద్దు

image

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీన రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు గద్వాల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జనాభా గణన అంశంపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా తరగతుల దృష్ట్యా సోమవారం ప్రజావాణిని రద్దు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News March 14, 2026

మళ్లీ వర్షాలు!

image

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.