News September 10, 2025
మాచర్లలో యువకుడి అనుమానాస్పద మృతి

మాచర్లలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం రహదారిలో గల గ్యాస్ గోదాము పక్కన ఉన్న తారు ప్లాంటు వద్ద యువకుడి తలకు తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.హత్యా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 17, 2026
శ్రీశైలంలో నేటి పూజా కార్యక్రమాలు

శ్రీశైల దేవస్థానంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా మంగళవారం..
◆ ఉ.8గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు
◆ ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ
◆ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం
◆ రా.7 గంటలకు స్వామి, అమ్మవారికి కైలాస వాహన సేవ పూజలు
◆ అమ్మవారికి మహాదుర్గ అలంకారం
◆ రా.7.30 నుంచి పురవీధుల్లో గ్రామోత్సవం
◆ రాత్రి 8 గంటలకు కళ్యాణం, ఏకాంత సేవ
News March 17, 2026
ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు GHMC ఇటీవల ప్రకటించింది. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.
News March 17, 2026
సాగర్ ఎడమ కాల్వలో మిర్యాలగూడ యువకుడి గల్లంతు

మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగెల్లి తరుణ్ (22) బొక్కమంతులపాడు శివారులో సాగర్ ఎడమ కాల్వలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులతో కలిసి బట్టలు ఉతకడానికి వచ్చిన అతడు సోమవారం సాయంత్రం ఈత కొడుతుండగా నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయినట్లు తెలిపారు. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అన్న మణిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


