News September 10, 2025

చింతలపల్లిలో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

వరంగల్ జిల్లా సంగెం మండలంలోని చింతలపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. సంగెం మండల కేంద్రానికి చెందిన భూపతి నాగరాజు(26) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 15, 2026

ఎన్నికల వే‘ఢీ’.. సమ్మర్‌లో సమరమే!

image

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల <<19389988>>షెడ్యూల్‌తో<<>> వేసవిలో ఎలక్షన్ వే‘ఢీ’ మొదలైంది. అస్సాం మినహా మూడింట(TN, బెంగాల్, కేరళం) BJPయేతర ప్రభుత్వాలే ఉండటంతో సమరం రంజుగా సాగనుంది. ఆయా రాష్ట్రాల్లో పట్టు సాధించాలని BJP చూస్తుండగా మరోసారి ప్రభుత్వాలను నిలబెట్టుకోవాలని స్టాలిన్, మమత, విజయన్ పోరాడుతున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పార్టీల ప్రచారాలు, రాజకీయ విమర్శలతో ఈసమ్మర్ హాట్‌హాట్‌గా సాగనుంది.

News March 15, 2026

తాళ్లపాలెం నుంచి యూటర్న్ తీసుకున్న పెద్దపులి

image

ఆదివారం రాత్రి మరోసారి పెద్ద పులి యూటర్న్ తీసుకుంది. తాళ్లపాలెంలో మకాం వేసిన పులి రాత్రి మండపం నుంచి శంఖవరం వచ్చే రహదారిలో మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి సమీపంలో తిష్ఠ వేసిందని అధికారులు తెలిపారు. శంకవరం-మండపం రోడ్డులో బ్రిడ్జి సమీపంలో ఇది ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.

News March 15, 2026

రాజంపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికుల తిప్పలు

image

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.