News September 10, 2025

పల్నాడు: ఫ్రెండ్స్ మధ్య గొడవ.. గన్‌తో కాల్చేశాడు..!

image

చిలకలూరిపేటకు చెందిన దివ్వెల దీపక్ (22)ను నోయిడాలో అతని స్నేహితుడు దేవాన్ష్ పిస్టల్‌తో కాల్చి చంపాడు. మంగళవారం హాస్టల్ గదిలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, దేవాన్ష్ తన లైసెన్సుడు పిస్టల్‌తో దీపక్ నుదుటిపై కాల్చాడు. ఆ తర్వాత దేవాన్ష్ కూడా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 10, 2025

కల్వకుర్తి: గుండెపోటుతో థియేటర్ యజమాని మృతి

image

కల్వకుర్తిలోని నేషనల్ థియేటర్ ప్రొప్రైటర్ దీపక్(44) గుండెపోటుతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దీపక్ బుధవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోగా మృతి చెందినట్లు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉండే దీపక్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

News September 10, 2025

నిర్మల్: సూక్ష్మ హరిత ఆహార కేంద్రం ప్రారంభం

image

నిర్మల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యేలు కలిసి సూక్ష్మ హరిత ఆహార కేంద్రాన్ని ప్రారంభించారు. సేంద్రీయ పదార్థాలతో తయారు చేసిన ఆహార పదార్థాలను రుచి చూశారు. అలాగే మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వారి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వెడ్మా బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.

News September 10, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤నరసన్నపేట: గ్యాస్ లీకై.. వ్యాపించిన మంటలు
➤పాతపట్నం: బురదలో కూరుకుపోయిన లారీ.. ట్రాఫిక్ జామ్
➤టెక్కలి: మండుటెండలో విద్యార్థుల అవస్థలు
➤ఎచ్చెర్ల: అంబేడ్కర్ వర్శిటీ నూతన రిజిస్ట్రార్‌గా అడ్డయ్య
➤సరుబుజ్జిలి: ధర్మల్ ప్లాంట్‌ను వ్యతిరేకించిన ఆదివాసీలు
➤శ్రీకాకుళం: 11న డయల్ యువర్ ఆర్ఎం
➤ఆమదాలవలస: వివాహిత ఆత్మహత్య..నలుగురికి రిమాండ్