News September 10, 2025

SKLM: అప్పారావు నేత్రాలు సజీవం

image

శ్రీకాకుళంలోని గుడి వీధికి చెందిన ఆంధవరపు అప్పారావు (93) బుధవారం ఉదయం మృతి చెందారు. వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలిపారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి.సుజాత, ఉమశంకర్ ద్వారా అతని కార్నియాలు సేకరించారు. విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు.

Similar News

News March 14, 2026

విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదు: SKLM కలెక్టర్

image

విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పైపులైన్ కనెక్షన్లుపై ఎమినిటి సెక్రటరీస్, మున్సిపల్ అధికారులతో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

News March 14, 2026

సిక్కోలు దొర..సేవలు మరువలేం

image

మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సిక్కోలు జిల్లాకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన హనుమంతు జగన్నాథ దొర మన ప్రాంత వాసి కావడం గర్వకారణం.1943లో కోటబొమ్మాళి(M) జర్జంగిలో జన్మించిన హెచ్. జె.దొర పోలీసు శాఖలో 40 ఏళ్లుగా పని చేశారు. స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణమండపం, శివాలయాన్ని నిర్మించారు. సొంత ఇంటిని వృత్తి విద్యా శిక్షణా కేంద్రంగా మార్చి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.

News March 14, 2026

గారలో బౌద్ధక్షేత్రాన్ని సందర్శించిన జపనీస్

image

గార మండలం సాలిహుండం బౌద్ధక్షేత్రాన్ని జపాన్ దేశానికి చెందిన బృందం నేడు సందర్శించారు. ప్రాచీన బౌద్ధ స్మారకాలు, స్థూపాల అవశేషాలను ఆసక్తిగా పరిశీలించి వాటి చారిత్రక ప్రాముఖ్యతపై తెలుసుకున్నారు. ఈ సందర్శనతో సాలిహుండం అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని స్థానికులంటున్నారు. ప్రజలు, ప్రతినిధులను వీరిని ఆత్మీయంగా ఆహ్వానించారు.