News September 10, 2025
తురకపాలెం వరుస మరణాలపై అధ్యయనం: సత్యకుమార్

AP: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి కారణాలు తెలుసుకుంటామన్నారు. ‘ఐసీఏఆర్ టీమ్ ఇక్కడ పర్యటించింది. ఇప్పటికే మట్టి, తాగునీటి శాంపిల్స్ సేకరించింది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇవాళ వస్తుంది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ టీమ్ కూడా గుంటూరుకు వస్తోంది’ అని ఆయన తెలిపారు.
Similar News
News September 10, 2025
మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది: సుప్రీంకోర్టు

నేపాల్, బంగ్లాలో నిరసనలతో ప్రభుత్వాలు కూలిపోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్ పరిస్థితి చూడొచ్చు’ అని చీఫ్ జస్టిస్ BR గవాయ్ అన్నారు. బంగ్లాలోనూ ఇదే జరిగిందని జస్టిస్ విక్రమ్నాథ్ గుర్తుచేశారు. రాష్ట్ర బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించాలన్న పిటిషన్పై వాదనల సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
News September 10, 2025
నేపాల్ తాత్కాలిక PMగా సుశీల!

నేపాల్ తాత్కాలిక PMగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ పేరును ఆందోళనకారులు ప్రతిపాదించారు. Gen-Z గ్రూప్తో వర్చువల్గా సమావేశమైన సుశీల తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆమె నేతృత్వంలో ఆర్మీ చీఫ్తో చర్చలకు నిరసనకారులు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉన్న యువత ఈ చర్చల్లో పాల్గొనొద్దన్న నిబంధనకు Gen-Z గ్రూప్ అంగీకరించినట్లు తెలుస్తోంది.
News September 10, 2025
₹1.56 లక్షలకు తగ్గనున్న బుల్లెట్ బైక్ ధర!

GST సవరణ నేపథ్యంలో తమ కంపెనీ బైక్స్ ధరలను తగ్గించినట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. దీంతో ఈనెల 22 నుంచి 350cc కెపాసిటీ మోడల్స్ ధరలు ₹22 వేల వరకు తగ్గనున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350(బేస్ మోడల్) ఎక్స్ షోరూమ్ రేట్ ₹1.56 లక్షలు, క్లాసిక్ 350 రేట్ ₹1.77 లక్షలు, హంటర్ 350 ధర కనిష్ఠంగా ₹1.27 లక్షలకు తగ్గే అవకాశం ఉంది. అటు 350cc కెపాసిటీకి మించిన అన్ని రకాల మోడల్స్ రేట్స్ భారీగా పెరగనున్నాయి.