News September 10, 2025
సిరిసిల్ల: కోడెల పంపిణీకి దరఖాస్తుల ఆహ్వానం

కోడెల పంపిణీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈనెల 14న ఉదయం 9 గంటలకు వేములవాడ మండలం తిప్పాపూర్లోని గోశాలలో కోడెలను పంపిణీ చేస్తామని వివరించారు. ఆసక్తి గలవారు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. https://rajannasircilla.telangana.gov.in/.
Similar News
News March 14, 2026
నెతన్యాహు చనిపోయారా?

ఇరాన్తో యుద్ధం వేళ సంచలన ప్రశ్న తెరపైకి వచ్చింది. నెతన్యాహు మృతి చెందారని SMలో ప్రచారం జరుగుతోంది. యుద్ధం గురించి మాట్లాడిన వీడియోను ఆయన నిన్న Xలో షేర్ చేశారు. అందులో నెతన్యాహు కుడిచేతికి 6 వేళ్లున్నాయి. దీంతో ఇది AI వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నెతన్యాహు మరణం గురించి శత్రుదేశానికి తెలియొద్దనే ఇలా AIతో వీడియో చేసి రిలీజ్ చేశారని అంటున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పందించాల్సి ఉంది.
News March 14, 2026
కార్యకర్తల మధ్యే మంత్రి.. సత్యకుమార్ వినయానికి ప్రశంసలు!

ధర్మవరంలో జరిగిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ క్లాసులో మంత్రి సత్యకుమార్ కార్యకర్తలా పాల్గొని ప్రశంసలు పొందారు. పదవిలో ఉన్నా ప్రత్యేక సదుపాయాలు కోరలేదు. తోటి కార్యకర్తలతో కూర్చొని శ్రద్ధగా వినడం ఆయన వినయాన్ని ప్రతిబింబించింది. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, సేవాభావం ప్రతీ కార్యకర్తలో ఉండాలని ఆచరణతో చూపించారు. కార్యకర్తలతో నడవడమే నిజమైన నాయకత్వమని ఈ దృశ్యం తెలుపుతోంది.
News March 14, 2026
FIFA WC, 2028 ఒలింపిక్స్కు నో ఎంట్రీ.. ట్రంప్కు షాక్ తప్పదా?

USలో ఈ ఏడాది జరిగే FIFA WC, 2028 LA ఒలింపిక్స్కు ట్రంప్ను, ప్రభుత్వ అధికారులను నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) యోచిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి తమకు చెల్లించాల్సిన $7.3 మిలియన్లను US పెండింగ్లో ఉంచడమే కారణమని తెలుస్తోంది. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్లో రష్యన్, 2024లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ నిర్దోషులుగా తేల్చడంతో WADA, US మధ్య విభేదాలు ముదిరాయి.


