News September 10, 2025
‘ఉండ్రాళ్ల తద్ది’.. ప్రాచుర్యంలో ఉన్న కథ

పూర్వం ఓ రాజు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు భార్యలున్నా వేశ్య ‘చిత్రాంగి’ పైనే ఎక్కువ అనురాగం ఉండేది. ఓనాడు రాజు భార్యలందరూ ఉండ్రాళ్ల తదియ నోము నోచుకుంటున్నారని ఆమెకు తెలుస్తుంది. ఆమె కూడా ఈ వ్రతం చేయాలని అనుకుంటుంది. రాజు అనుమతితో భాద్రపద తృతీయ నాడు ఉండ్రాళ్లు చేసి, గౌరీ దేవికి నైవేద్యంగా పెట్టి, కొందరు స్త్రీలకి వాయనమిస్తుంది. ఐదేళ్లపాటు నిర్విఘ్నంగా నోము నోయడంతో వేశ్య అయినా ఆమె సద్గతి పొందింది.
Similar News
News September 10, 2025
భారత్ బౌలింగ్.. టీమ్ ఇదే

ASIA CUP-2025లో భాగంగా టీమ్ ఇండియా ఇవాళ UAEతో తొలి మ్యాచ్ ఆడుతోంది. భారత కెప్టెన్ సూర్య టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు.
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్య కుమార్ యాదవ్ (C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
>SonyLIVలో లైవ్ మ్యాచ్ చూడొచ్చు.
News September 10, 2025
PHOTO GALLERY: ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’

AP: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీ-బీజేపీ-జనసేన అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించాయి. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో జరిగిన ఈ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. గత 15 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమం ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News September 10, 2025
AEE ఫలితాలు విడుదల

AP పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను APPSC విడుదల చేసింది. అభ్యర్థులు https://psc.ap.gov.inలో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని తెలిపింది. 2023లో 21 AEE పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నెలకు రూ.57,100-రూ.1,47,760 వరకు జీతం రానుంది.