News September 10, 2025
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి: సంగారెడ్డి ఎస్పీ

ఈ నెల 13న జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ పంకజ్ పరితోష్ అన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసుల్లో రాజీ చేసుకోవడం వల్ల కక్షలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. క్రిమినల్, సివిల్, ఆస్తి వివాదాలు, కుటుంబ, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులను ఈ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని ఆయన తెలిపారు.
Similar News
News March 22, 2026
నెల్లూరు నగరంలో దారుణ హత్య!

నెల్లూరు నగరంలో బోడిగోడి తోటలో దారుణ హత్య జరిగినట్లు సమాచారం. వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తిని ఈ హత్య చేసి కాల్చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 22, 2026
సిద్దిపేటకు సీఎం వరాలు ప్రకటించేనా?

సిద్దిపేట జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పైన జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో రైతు ఉత్సవాలు కార్యక్రమానికి సీఎం హాజరవుతున్న తరుణంలో నియోజకవర్గంలో ఆగిన అభివృద్ధి పనుల మోక్షానికి సీఎం నిధులు ప్రకటించే అవకాశం ఉందని చర్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రూ.1,070 కోట్ల అభివృద్ధి పనులకు ఈ ప్రభుత్వం బ్రేక్ వేయడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
News March 22, 2026
కృష్ణా: మళ్లీ కిరోసిన్ ముచ్చట

ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 దశాబ్దాల క్రితం నిత్యావసరంగా ఉన్న కిరోసిన్.. మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. గ్యాస్, విద్యుత్ పొయ్యిల రాకతో ప్రభుత్వం కిరోసిన్ సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యుద్ధాల కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని, వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో కిరోసిన్ పంపిణీ చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై అటు అధికారులు, ఇటు ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.


