News September 10, 2025
తిరోగమనంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ: జగన్

AP: రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోందని మాజీ CM జగన్ విమర్శించారు. పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ ప్రయోజనాలు దోపిడీదారులకు అందుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. శాంతిభద్రతలు కనిపించడం లేదు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వ ఉందా’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News September 10, 2025
అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా SIR!

ఓటర్ జాబితా రీవెరిఫికేషన్కు సంబంధించి బిహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(<<17634931>>SIR<<>>) త్వరలో దేశవ్యాప్తంగా జరగనున్నట్లు సమాచారం. OCT నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్తో జరిగిన మీటింగ్లో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నెలలోనే గ్రౌండ్ వర్క్ పూర్తిచేస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం.
News September 10, 2025
జూబ్లీహిల్స్లో BRS గెలిస్తే ప్రభుత్వం మారదు: పొన్నం

TG: ఇళ్ల కూల్చివేతపై <<17666775>>కేటీఆర్<<>> మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పదేళ్లు పాలించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నించారు. గతంలో ఉపఎన్నికల్లో రూ.కోట్ల డబ్బులు, లిక్కర్ సీసాలు బీఆర్ఎస్ పంచిందని ఫైరయ్యారు. జూబ్లీహిల్స్లో BRS గెలిచినంతా మాత్రాన ప్రభుత్వం మారదన్నారు. సొంత చెల్లికి న్యాయం చేయనివాడు జూబ్లీహిల్స్కు ఏం చేస్తాడని దుయ్యబట్టారు.
News September 10, 2025
మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది: సుప్రీంకోర్టు

నేపాల్, బంగ్లాలో నిరసనలతో ప్రభుత్వాలు కూలిపోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘మన రాజ్యాంగం పట్ల గర్వంగా ఉంది. పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి. నేపాల్ పరిస్థితి చూడొచ్చు’ అని చీఫ్ జస్టిస్ BR గవాయ్ అన్నారు. బంగ్లాలోనూ ఇదే జరిగిందని జస్టిస్ విక్రమ్నాథ్ గుర్తుచేశారు. రాష్ట్ర బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించాలన్న పిటిషన్పై వాదనల సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.