News September 10, 2025
171 మంది హాజరు.. 17 మందికి ఉద్యోగావకాశాలు

PDPL కలెక్టరేట్లో జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో జరిగిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. KNRకు చెందిన ఓ పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్వ్యూలో 171 మంది యువతీయువకులు పాల్గొనగా, 17 మందికి ఉద్యోగాలు లభించాయి. 10వ తరగతి నుంచి PG, బీటెక్, ITI వరకు విద్యార్హత ఉన్న విద్యార్థులు హాజరయ్యారు. యువత TASK శిక్షణ పొంది జాబ్ మేళాల్లో చురుకుగా పాల్గొనాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు సూచించారు.
Similar News
News March 16, 2026
ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తాం: సీఎం

ఇమామ్, మౌజమ్ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తరఫున విజయవాడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇప్పటికే ఇమామ్, మౌజన్లకు రూ. 5 వేలు, రూ. 10 వేల చొప్పున రూ. 180 కోట్లు అందించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించామన్నారు.
News March 16, 2026
100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలి

బెట్టింగులు, నిషేధిత గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా పోలీసులకు ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో జరిగిన నేర సమీక్షలో మాట్లాడుతూ.. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలు నిత్యం రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. 100కు ఫోన్ రాగానే ఘటనా స్థలానికి చేరుకోవాలని బాధితులకు అండగా నిలవాలన్నారు.
News March 16, 2026
సిద్దిపేట: ఈ నెల 22న సీఎం పర్యటనపై మంత్రుల సమీక్ష

సిద్దిపేట జిల్లా నర్మేటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే రైతులకు తాగునీరు, రవాణా సౌకర్యాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లపై అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.


