News September 10, 2025

BHPL: ‘జాతీయ లోక్-అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

సెప్టెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాజీ మార్గమే.. రాజ మార్గం. రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడవచ్చు’ అని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని అన్నారు.

Similar News

News March 6, 2026

అనకాపల్లి: రేకుల షెడ్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

ఎస్ రాయవరం(M) కొరుప్రోలు గ్రామంలోని సత్య వినాయక కొబ్బరి పీచు పరిశ్రమ స్టోరేజ్ షెడ్‌పై మరమ్మతు పనులు చేస్తుండగా గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్ రాయవరం గ్రామానికి చెందిన వెల్డర్ కొమ్ము నూకరాజు (50) షెడ్‌పై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలైయ్యాడు. అతనిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ విభీషణరావు తెలిపారు.

News March 6, 2026

మొక్క జొన్న రైతుల బకాయిలు విడుదల

image

TG: మొక్క జొన్న రైతుల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. మార్క్‌ఫెడ్‌కు ₹171 కోట్లు రిలీజ్ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకటీరెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు. ‘వానాకాలానికి సంబంధించి 78,500 మంది నుంచి 3.77 లక్షల టన్నుల మొక్కజొన్నలు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. తొలిదశలో ₹735.39 కోట్లు చెల్లించాం. మిగతా నిధులను తాజాగా రిలీజ్ చేశాం’ అని పేర్కొన్నారు.

News March 6, 2026

రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

image

రష్యా ఆయిల్ కొనేందుకు 30 రోజుల పాటు భారత్‌కు US తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందని ఆ దేశ ఉన్నతాధికారులు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ దీనికి అంగీకరించినట్లు తెలిపింది. అయితే ప్రస్తుతం సముద్ర జలాల్లో ఉన్న రష్యా ఆయిల్‌ను కొనేందుకే అనుమతి ఇచ్చినట్లు చెప్పింది. కాగా భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపడా ముడిచమురు నిల్వలే ఉన్నట్లు తెలుస్తోంది.