News September 10, 2025

సిరిసిల్ల: జిల్లాలో 10,234 ఇండ్ల మంజూరు

image

చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 10,234 ఇండ్లను మంజూరు చేయగా 5,301 మార్కింగ్ జరిగాయన్నారు. 3,230 బేస్మెంట్ స్థాయికి, 192 గోడల దశకు, 643 రూఫ్ వరకు, ఒక ఇల్లు పూర్తైందన్నారు.

Similar News

News March 4, 2026

బస్సుల్లో తగ్గిన పురుష ప్రయాణికుల సంఖ్య

image

AP: ‘స్త్రీ శక్తి’ పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. FEBలో నిత్యం 26 లక్షల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు RTC తెలిపింది. దీంతో ఆక్యుపెన్సీ 92% దాటింది. అదే సమయంలో పురుషులు బస్సుల్లో ట్రావెల్ చేయడానికి జంకుతున్నారు. వారి సంఖ్య 37శాతానికి పడిపోయింది. బస్సుల్లో సీట్లు దొరకకపోవడమే దీనికి ప్రధాన కారణం. తాము డబ్బులు చెల్లిస్తున్నా సౌకర్యంగా ప్రయాణించలేకపోతున్నామని వారు వాపోతున్నారు.

News March 4, 2026

ఆపరేషన్ నన్హే ఫరిష్తే.. 126 మంది బాలబాలికలకు విముక్తి

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైల్వే రక్షణ దళం చేపట్టిన ‘ఆపరేషన్ నన్హే ఫరిష్తే’లో భాగంగా 126 మంది బాలబాలికలను రక్షించారు. వీరిలో 105 మంది బాలురు, 21 మంది బాలికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తప్పిపోయిన, కుటుంబాలకు దూరమైన చిన్నారులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించి, వారి కుటుంబాలతో కలపడానికి చర్యలు చేపట్టినట్లు మంగళవారం నిర్వహించిన సమావేశంలో అధికారులు వెల్లడించారు.

News March 4, 2026

భూపాలపల్లి: నేటి నుంచి జిల్లాలో ‘ఆరోగ్య రక్షణ’ ప్లాన్

image

జిల్లాలో 100 రోజుల ప్రత్యేక ఆరోగ్య రక్షణ యాక్షన్ ప్లాన్ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 4 నుంచి 6-18 ఏళ్ల లోపు విద్యార్థులందరికీ పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక రుగ్మతలపై స్క్రీనింగ్ నిర్వహిస్తారు. విద్యార్థులకు యోగా, కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తామని, సిబ్బందికి ఇప్పటికే దిశానిర్దేశం చేశామని ఆయన పేర్కొన్నారు.