News September 10, 2025
కామారెడ్డి జిల్లాలో 274 ఆత్మహత్యలు

కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యల సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 274 ఆత్మహత్యలు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్యం, ప్రేమ వ్యవహారాలు వంటి అనేక కారణాల వల్ల పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా?

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పాలకమండలి లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 2022 నవంబర్ తర్వాత పాలకమండలి సమావేశం జరగలేదు. పాలకమండలిలో 12 మంది సభ్యులు ఉంటారు, ఏడుగురు అత్యవసర సభ్యులు. కాగా ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా మండలి సమావేశం జరగాలి. అయితే అలా జరగడం లేదు. దీంతో పాలన గాడి తప్పిందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు.
News March 22, 2026
సమ్మర్లో చికెన్ తింటున్నారా?

సమ్మర్లో మితంగా చికెన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఇది అధిక ప్రొటీన్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమై శరీర వేడిని పెంచుతుంది. దీంతో తలనొప్పి, కళ్ల మంటలు, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ రెండుమూడు సార్లు తీసుకుంటే బరువు పెరుగుతారు’ అని హెచ్చరిస్తున్నారు.
News March 22, 2026
విశాఖ: ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్

నగరంలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం వేకువజాము వరకు కైలాసగిరి, సత్యం కూడలిలో గల విప్రో కంపెనీ వద్ద ఆక్టోపస్ టీం విశాఖ నగర సిటీ పోలీస్ బాంబు స్క్వాడ్తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించింది. అకస్మాత్తుగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లయితే దాని నుంచి వీఐపీలను ఎలా కాపాడాలి, ఎలా బయటపడాలి అనే కోణంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు వారు తెలిపారు.


