News September 10, 2025

భద్రాద్రి: పల్లె ప్రకృతి వనాలు.. పశువులకు నిలయాలు!

image

అళ్లపల్లి మండలం మైలారం పాఠశాల పక్కన లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గేదెల మేతకు నిలయంగా మారింది. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వనంలో చెట్లు నాశనమవుతున్నాయి. అధికారులు వెంటనే దీని చుట్టూ కంచె ఏర్పాటు చేసి మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News September 10, 2025

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం సమగ్ర శిక్ష APC మద్దిపట్ల వెంకటరమణతో కలిసి MEO, CRC హెచ్ఎంలతో రివ్యూ నిర్వహించారు. పాఠశాల వారీగా డ్రాప్స్ జాబితా ఇవ్వాలని సూచించారు. పిల్లలు 100% పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మిడ్ డే మీల్స్, హ్యాండ్ బుక్, FA-1 మార్కులు, CRC గ్రాండ్స్, MRC గ్రాండ్స్ పై రివ్యూ చేపట్టారు.

News September 10, 2025

‘అఖండ-2’కు OTT రైట్స్ @రూ.80కోట్లు?

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అఖండ-2’ మూవీ డిజిటల్ రైట్స్ రూ.80+ కోట్లు పలికినట్లు సినీ వర్గాలు తెలిపాయి. OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దీనిని దక్కించుకుందని పేర్కొన్నాయి. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ మూవీని డిసెంబర్‌ తొలివారంలో రిలీజ్ చేస్తామని ఇటీవల బాలయ్య తెలిపారు.

News September 10, 2025

గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*గద్వాల: చాకలి ఐలమ్మ వర్ధంతి.
*లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి.
*పిడుగుపడి ముగ్గురు మృతి. *గట్టు: GPభవన నిర్మాణానికి భూమి పూజ.
*మల్దకల్: కాంగ్రెస్ నేత కు BRSలోకి రావాలని ఆహ్వానం. *అయిజ: గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి *అలంపూర్: నవరాత్రి ఉత్సవాల పోస్టర్ విడుదల.
*మానవపాడు: ఉద్యోగులకు బదిలీలు సహజం.
*ఎర్రవల్లి: ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు చేయాలి.
*ధరూర్: జూరాల గేట్లు మూసివేత.