News September 10, 2025
నర్సాపూర్(జీ): నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం!

నర్సాపూర్(జీ)కి చెందిన ఓ వ్యక్తి 2018లో విదేశాల్లో మరణించగా.. గ్రామ పంచాయతీ అధికారులు 2019లో అతడు స్థానికంగానే మరణించినట్లుగా తప్పుడు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు. విదేశాల్లో మృతి చెందిన వారికి విదేశాంగ శాఖ మాత్రమే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. గ్రామ పంచాయతీ అధికారులు ఇలా తప్పుడు పత్రం ఇవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Similar News
News March 21, 2026
పిట్లం: షీర్ ఖుర్మా.. పాలకు డిమాండ్

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా పిట్లంలో పాల ధరలు పెరిగాయి. పండుగ ప్రత్యేక వంటకమైన ‘షీర్ ఖుర్మా’ తయారీకి పాలు ప్రధానం కావడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో కంటే అదనపు అవసరం ఉండటంతో పాల కేంద్రాల్లో లీటర్ పాలు రూ.80 వరకు విక్రయిస్తున్నారు. మరి మీ ప్రాంతంలో లీటర్ పాల ధర ఎంత ఉందో? కామెంట్ రూపంలో తెలియజేయండి.
News March 21, 2026
నేడు, రేపు వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 21, 2026
గుంటూరు: CRDA కమిషనర్గా విజయరామరాజు

CRDA కమిషనర్గా విజయరామరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇప్పటివరకు కమిషనర్గా పనిచేసిన కన్నబాబును పౌరసరఫరాల కమిషనర్గా నియమించింది. కాగా CRDA కమిషనర్గా విజయరామరాజు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో CRDA కమిషనర్లుగా చెరుకూరి శ్రీధర్, వివేక్ యాదవ్, కాటమనేని భాస్కరరావు, కన్నబాబు (ప్రస్తుతం) పనిచేశారు.


