News September 10, 2025
బాలానగర్: భార్యను కోల్పోయిన బాధతో భర్త SUICIDE

భార్యను కోల్పోయిన బాధను తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుకుంది. SI లెనిన్ తెలిపిన వివరాలు.. వీరన్నపల్లి వాసి ఎల్లయ్య(57) భార్య పద్మమ్మ నాలుగేళ్ల కిందట చనిపోయింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఎల్లయ్య మంగళవారం పొలంలో పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆయన మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News March 17, 2026
పాడేరు: 36 మందిపై కేసులు కొట్టివేత

ఆదివాసీ ఉద్యమకారులు 36 మందిపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను పాడేరు ప్రథమ శ్రేణి జ్యూడీషియల్ కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చినట్లు గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స సోమవారం తెలిపారు. 2021లో జీవో నెంబర్-3ని చట్టబద్ధం చేయాలని కోరుతూ చేపట్టిన బంద్ ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించారనే ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్నారు. ఆ కేసును కోర్టు కొట్టివేసిందన్నారు.
News March 17, 2026
KKRకు గాయాల ‘దెబ్బ’

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్మెంట్ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.
News March 17, 2026
కృష్ణా: వారికి నేడే ఆఖరి రోజు!

జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గ సభ్యులకు నేడు చివరి రోజు కానుంది. దీంతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాలనకు ముగింపు పలుకుతూ, రేపటి నుంచి పట్టణ పరిపాలన పూర్తిగా ప్రభుత్వ నియమిత ప్రత్యేక అధికారుల చేతుల్లోకి వెళ్లనుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల నియామకానికి మార్గదర్శకాలు జారీ చేసి అధికారులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో పరిపాలన కొనసాగింపు బాధ్యతలు అధికారులు చేపట్టనున్నారు.


