News September 10, 2025
రైతుల కోసం అగ్రికల్చర్ వాట్సాప్ ఛానల్ ప్రారంభం

రాష్ట్ర వ్యవసాయశాఖ కొత్తగా వాట్సప్ ఛానెల్ ను ప్రారంభించింది. అగ్రికల్చర్ డిపార్టుమెంట్ తెలంగాణ పేరుతో గత నెల 8న అందుబాటులోకి తెచ్చింది. నెల రోజుల్లోనే దాదాపు 35 వేల మంది రైతులు ఫాలోవర్స్ గా ఉన్నారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు తెలంగాణ రైతాంగానికి కీలకమైన సమాచారం, సలహాలు, సూచనలను వ్యవసాయ శాఖ అందిస్తోంది. జగిత్యాల జిల్లాలో మెత్తం 2,48,550 మంది రైతులు ఉండగా, 4,18,569 ఎకరాల సాగుభూమి ఉంది.
Similar News
News September 11, 2025
HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్కు అభినందనలు తెలిపారు.
News September 11, 2025
HYD: హైకోర్టులో నల్లా బాలుకు ఊరట.. KTR హర్షం

సోషల్ మీడియా యాక్టివిస్ట్ నల్లా బాలుపై కాంగ్రెస్ పెట్టిన 3 కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. రాజకీయ ప్రేరేపిత కేసులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించడం ఆపాలి’ అని డీజీపీని కోరారు. కేసులో విజయం సాధించినందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్కు అభినందనలు తెలిపారు.
News September 11, 2025
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగవంతం చేయండి: కలెక్టర్

కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఏలూరు జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అందరికి ఇళ్లు పథకం విచారణను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 6.14 లక్షల కార్డుల్లో ఇప్పటి వరకు 4.54 లక్షలు పంపిణీ చేశామన్నారు. మిగిలినవి 2 రోజుల్లో ఇవ్వాలని సూచించారు. 1,390 ఇళ్ల విచారణను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.