News September 10, 2025

13న గుంటూరులో జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, చిన్న క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంక్, భూ వివాదం, విభజన వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News April 5, 2026

PGRS అర్జీల స్థితిని తెలుసుకోండిలా: GNT కలెక్టర్

image

గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూక్లీనిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు.  మీకోసం వెబ్ సైట్‌లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని, సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చని చెప్పారు.

News April 5, 2026

గుంటూరులో ఓపెన్ డ్రింకింగ్‌.. 179 మందిపై కేసులు

image

గుంటూరు జిల్లాలో బహిరంగ మద్యం తాగే వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. SP వకుల్ జిందాల్ ఆదేశాలతో నిన్న సాయంత్రం 5:30 నుంచి 9గంటల వరకు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో 178 కేసులు నమోదు చేసి, 179 మందిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో 8 FIR కేసులు, 170 పెట్టి కేసులు ఉన్నాయి. ప్రధాన రహదారులు, కాలనీలు, గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు చట్టాలను పాటించాలని పోలీసులు సూచించారు.

News April 5, 2026

యువ అధికారుల పాలనలో గుంటూరు జిల్లా..!

image

గుంటూరు జిల్లాలో పాలన బాధ్యతలు యువ ఐఏఎస్ అధికారులకు అప్పగించారు. కలెక్టర్ సాయికాంత్ వర్మ, జేసీ ఆశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు. గతంలో సమన్వయం లోపంతో పురోగతి మందగించిందని భావించిన ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు సమాచారం. వీరు భూ వివాదాలు, రేషన్ అక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. నగరంలో డ్రెయినేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమని ప్రజలు ఆశిస్తున్నారు.