News September 10, 2025
కేంద్ర సహకారంతో త్వరలో రాజధాని పూర్తవుతుంది: మాధవ్

AP: ఏడాదిలో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ తెలిపారు. ‘సూపర్ సిక్స్ పథకాలను ఇతర రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందజేస్తోంది. అమరావతికి ప్రత్యేకంగా రూ.15వేల కోట్ల గ్రాంట్ ఇస్తున్నాం. కేంద్ర సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుంది. త్వరలో ఏపీ సెమీ కండక్టర్ హబ్గా మారబోతోంది’ అని అనంతపురం సభలో పేర్కొన్నారు.
Similar News
News March 16, 2026
‘మధుబాల’గా మెప్పించనున్న సాయిపల్లవి?

‘ఏక్ దిన్’ సినిమాతో <<19355627>>బాలీవుడ్లో<<>> అడుగుపెట్టనున్న సాయి పల్లవి మరో హిందీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించనున్న అలనాటి బ్యూటీ క్వీన్ మధుబాల బయోపిక్ కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం సాయి పల్లవి రామాయణ మూవీతోపాటు ధనుష్ సినిమాతో బిజీగా ఉన్నారు.
News March 16, 2026
నేడు అమరావతిలో ‘అమరజీవి’ విగ్రహావిష్కరణ

AP: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా అమరావతిలోని తుళ్లూరులో 58 అడుగుల విగ్రహాన్ని CM చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు. ₹150 కోట్ల అంచనా వ్యయంతో 6.8 ఎకరాల్లో చేపట్టిన స్మృతి వనం తొలి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తారు.
News March 16, 2026
‘బాబ్ ఎల్-మండేబ్’నూ మూసేస్తే ప్రత్యామ్నాయమిదే

హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండగా దానికి మద్దతుగా <<19387645>>‘బాబ్ ఎల్-మండేబ్’<<>> జలసంధినీ మూసివేస్తామని యెమెన్లోని హౌతీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మార్గంలో యూరప్ నుంచి ఆసియాకు సరకు రవాణాకు 20-25 రోజుల సమయం పడుతోంది. ఇది బందయితే ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ద్వారా రవాణాకు 30-40 రోజుల టైమ్ పడుతుంది. దీనివల్ల 30% గ్లోబల్ ట్రేడ్పై ప్రభావం పడుతుంది.


