News April 4, 2024

నల్గొండ: రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

image

కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన అమనగంటి ఎల్లమ్మ మృతిచెందగా, ఆనంతమ్మ , భారతమ్మ, పూలమ్మ, ఎల్లయ్య గాయపడ్డారు.

Similar News

News January 10, 2026

నల్గొండ జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

దేవరకొండ: మద్యం మత్తులో 100కు డయల్.. ఏమైందంటే..
నల్గొండ: ఎన్జీ కళాశాలలో ముగిసిన జాతీయ సదస్సు
నార్కట్‌పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష
నల్గొండ: పురపోరుకు ఎర్రజెండా సైన్యంసై
నార్కట్ పల్లి: చెరువుగట్టు జాత తేదీల ప్రకటన
నల్గొండ : జిల్లా వ్యాప్తంగా పెరిగిన నిఘా
మిర్యాలగూడ : కొత్తగా మిర్యాలగూడ జిల్లా?
నల్గొండ : నాలుగు నెలలు ఆగాల్సిందే..
నల్గొండ : తెరపడిన మదర్ డెయిరీ వివాదం

News January 9, 2026

నల్గొండ: ప్రభుత్వ భవనాలపై నివేదిక ఇవ్వండి: అదనపు కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల భవనాల స్థితిగతులపై సమగ్ర నివేదిక సమర్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వార్డు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో 7 మున్సిపాలిటీల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అద్దె భవనాల భారం తగ్గించి, ప్రభుత్వ భవనాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పాత భవనాలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.

News January 9, 2026

నార్కట్‌పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

image

ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో జనవరి 23 నుంచి 30 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.