News September 10, 2025

ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: ఎమ్మెల్యే

image

నెల రోజుల్లోగా ఓదెల ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ శ్రీహర్షతో కలిసి ఓదెల ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలు పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ పరిధిలో 500 మీటర్లలోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం నిషేధమని పేర్కొన్నారు. ఆలయ పాలకమండలితో ఆలయ అభివృద్ధిపై చర్చించారు. అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News March 11, 2026

ఏలూరు జిల్లాలో కావూరి ప్రస్థానం ఇదే..!

image

ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు నాయకుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1984,1989లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. 2004, 2009లో ఏలూరు ఎంపీగా పనిచేశారు. 2013లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఏలూరు జిల్లాలోని గ్రామాలలో సైతం పర్యటించి వారి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, అభివృద్ధి బాటలో నడిపించిన వ్యక్తి అని కొనియాడారు.

News March 11, 2026

సర్‌ప్రైజింగ్.. రోడ్డుపై గుంత వల్ల దక్కిన ప్రాణం!

image

UPకి చెందిన వినీత శుక్లా(50) మరణం అంచులకు చేరి తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్లు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. NH-74పై ఉన్న ఓ పెద్ద గుంత వల్ల వాహనం తీవ్ర కుదుపునకు లోనైంది. దాంతో ఆమెలో మళ్లీ చలనం మొదలై శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

News March 11, 2026

విజయవాడలో మాజీ ఎంపీ సురేశ్‌పై ఛీటింగ్ కేసు నమోదు

image

కాకినాడకు చెందిన ఓ ట్రస్ట్ రెన్యూవల్ వ్యవహారంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్ మోసం చేసారంటూ సూర్యారావుపేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ట్రస్ట్ రెన్యూవల్ చేయిస్తానంటూ రూ.25 లక్షలు తీసుకున్న సురేశ్ ఆ పని చేయించలేదంటూ బాధితులు పోలీసులకు విన్నవించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సురేశ్‌పై నేర శిక్షాస్మృతి ప్రకారం కేసు నమోదు చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది.